Saturday, April 20, 2024

ప్ర‌ధాని మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఎంపీ ర‌ఘురామ

నరసాపురం ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించి, ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడిన వారికి పద్మ అవార్డులను ప్రకటించడంపై ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశ్రీకి ఎంపికైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ నటి షావుకారు జానకి, ఫోన్ కళాకారుడు రామచంద్రయ్య, కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. నాదస్వర కళాకారుడు స్వర్గీయ గోసవీడు షేక్ హసన్ గారికి పద్మశ్రీ రావడం అభినందనీయమన్నారు. కాగా, అవార్డులందుకున్న తెలుగు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ అందుకున్న తెలంగాణ కిన్నెర గాన కళాకారుడు మొగిలయ్యకు ర‌ఘురామ కృష్ణ‌రాజు అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement