Wednesday, April 17, 2024

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖాస్త్రం

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్‌కు ఆయన ఆదివారం మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో అమరావతి నిర్మాణంపై లేఖ రాశారు. అమరావతి ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు అవసరమా? అని లేఖలో ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఒరిగేదేమీలేదని తేల్చిచెప్పారు. మూడు రాజధానుల వల్ల ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురువుతాయని తెలిపారు. రాజధానికి నిస్వార్థంగా భూములిచ్చిన రైతుల వేదనను అర్ధం చేసుకోవాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement