Tuesday, April 23, 2024

సీఎంకు వరుసగా ఏడో లేఖ రాసిన ఎంపీ రఘురామ!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌కి ఆయన నేడు వరుసగా ఏడో రోజు కూడా లేఖ రాశారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలిచారని, కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా సాయాన్ని అందించాలని కోరారు. రైతు సాయంగా కేంద్రం అందిస్తున్న రూ. 6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 13,500 కలిపి మొత్తం రూ. 19,500ను అందించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని రఘురామ లేఖలో కోరారు. కాగా, నిన్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై ఇచ్చిన హామీలను నెలబెట్టుకోవాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement