Friday, March 29, 2024

బిజెపి ఓట‌మి ఖాయం..ఎంపీ అస‌దుద్దీన్

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో బిజెపికి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌ని ఎంఐఎం నేత .. ఎంపీ అస‌దుద్దీన్ తెలిపారు.తెలంగాణ‌లో లౌకిక వాదాన్ని…బ‌హుజ‌న‌వాదాన్ని బిజెపి చెడగొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లోనే కాకుండా.. రాబోయే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ బిజెపి ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో ముస్లీంలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అస‌ద్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తాము ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వంద స్థానాల్లో పోటీచేస్తామ‌న్నారు.. యోగిని ఓడించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మని అస‌ద్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద ముస్లీంల‌కు ప‌ది ఇల్లు కూడా రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement