Wednesday, April 24, 2024

సినీ ప‌బ్లిసిటీ ఇన్ఛార్జ్.. వీర‌మాచ‌నేని ప్ర‌మోద్ కుమార్ క‌న్నుమూత‌

మూడు వంద‌ల‌కి పైగా సినిమాల‌కు ప‌బ్లిసిటీ ఇన్ఛార్జిగా ప‌ని చేసిన వీర‌మాచ‌నేని ప్ర‌మోద్ కుమార్ క‌న్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ప్రమోద్ కుమార్ 38 ఏళ్ల పాటు సినీ రంగంలో పబ్లిసిటీ ఇన్చార్జిగా కొనసాగారు. ఆయన పబ్లిసిటీ అందించిన 31 చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ప్రమోద్ కుమార్ కొన్ని చిత్రాల్లోనూ నటించారు. అంతేకాదు, తన మిత్రులతో కలిసి దొంగ పోలీస్ (మోహన్ బాబు హీరో), గరం మసాలా అనే చిత్రాలను నిర్మించారు. ప్రమోద్ కుమార్ రచయిత కూడా. తెర వెనుక తెలుగు సినిమా అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. ఈ పుస్తకానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. అంతకుముందు సుబ్బయ్య గారి మేడ పేరుతో ఓ నవల కూడా రాశారు. ఆయనకు తులసి రాణి, సరోజ అనే ఇద్దరు కుమార్తెలు, శ్రీనివాస్ రాయ్ అనే కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement