Friday, March 29, 2024

వాహనదారులు అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

భారీ వర్షాలతో రోడ్లపై నుండి వరద నీరు ప్రవహిస్తుందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారి పైనుండి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వర్షం నీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట ఏసిపి సారంగపాణి సిఐలు అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి,ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement