Thursday, April 25, 2024

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో అందుబాటులోకి మరిన్ని రైళ్లు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున రైళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్‌ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పట్టాలెక్కించింది. తాజాగా మరోసారి పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో గరీబ్ రథ్‌ స్పెషల్ తాజ్ ఎక్స్‌ప్రెస్, షాన్-ఎ-పంజాబ్, ముంబై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్ట్‌ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 50కిపైగా రైళ్లను తిరిగి ప్రారంభిస్తోంది. ప్రజలకు ప్రయాణం మళ్లీ చౌకగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని రైల్వేశాఖ మంత్రి పీయూల్‌ గోయల్‌ వెల్లడించారు.

షాజహాన్‌పూర్-సీతాపూర్ సిటీ, సీతాపూర్‌ సిటీ- షాజహాన్‌పూర్‌ రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. లక్నో-వారణాసి ఇంటర్‌సిటీ స్పెషల్ (04270), వారణాసి-లక్నో ఇంటర్‌సిటీ స్పెషల్ (04269) సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. వారణాసి –ఆనంద్‌ విహార్ (04249)‌ ఈ నెల 8 నుంచి, ఆనంద్‌ విహార్‌ –వారణాసి (04250‌), గరీబ్‌ రథ్‌ స్పెషల్‌ రైళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మరో గరీబ్‌ రథ్‌ స్పెషల్‌ ఆనంద్‌ విహార్‌ –ముజఫర్‌పూర్‌ ట్రైన్‌ 7 నుంచి నడువనుంది. ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ –ఝాన్సీ తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ (04062), ఝాన్సీ –న్యూఢిల్లీ తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ పట్టాలెక్కనుంది.

ఇది కూడా చదవండి: భారత ప్రయాణికులకు యూఏఈ నిషేధం

Advertisement

తాజా వార్తలు

Advertisement