Wednesday, April 24, 2024

24 గంటల్లో 3వేలకు పైగా మరణాలు… ఇండియాలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 19.20 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించగా 3.86 ల‌క్ష‌ల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 1.87కోట్లు దాటింది. అటు క‌రోనా కార‌ణంగా గడిచిన 24 గంటల్లో మ‌రో 3,498 మంది చ‌నిపోయారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు 2,08,330 మంది దేశంలో క‌రోన కార‌ణంగా మ‌ర‌ణించారు.

ఇక గురువారం ఒక్కరోజు 2, 97,540 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీనితో దేశ వ్యాప్తంగా 1.53కోట్ల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 31 లక్షలు యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement