Thursday, April 25, 2024

Big Story : మరింత సరళంగా రికార్డులు, నిషేదిత జాబితాకు మోక్షం.. జఠిల సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆధీకృత ప్రతినిధి సంతకంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని ఆస్తుల జాబితాను అందించండి.. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సంతకం చేసిన వివిధ శాసనాల కింద నిషేదించిబడిన ఆస్తుల జాబితాను సత్వరమే అందజేయండి, వీటిని రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిషేదిత భూములు, ఆస్తుల వివరాలను మరోసారి సమీక్షించి సుమోటాగా నిషేదిత జాబితాలోని తప్పులను సరిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22(ఏ)కింద విక్రయించేందుకు వీలు లేకుండా నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన ప్రైవేటు భూములు, ఆస్తులను సదరు జాబితానుంచి తొలగించేలా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది.

అప్పట్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలోని కార్డ్‌ విధానంలో భాగంగా గెజిట్‌ నోటిఫై చేసిన ప్రభుత్వం నిసేదిత భూమయులు, ఆస్తుల వివరాలతో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ధరణి రాకతో అనేక కోర్టు కేసులు, సర్వే నెంబర్లలో బై నెంబర్లు, ట్రిబ్యునల్‌ తీర్పులు, కాలువలు, చెరువులు, శిఖం, పోరంబోకు, ప్రభుత్వ భూములు, ఇతర అవసరాలకు భూ కేటాయింపులకు చెందిన సర్వే నెంబర్లకు చెందిన భూములన్నీ ధరణిలో ప్రొహిబిషన్‌ లిస్టులోకి చేరాయి.

తాజాగా సీసీఎల్‌ఏ కార్యాలయంలో నిషేదిత భూముల తొలగింపు కసరత్తులో భాగంగా ఖాస్త్రా పహాణీనుంచి ధరణి పహాణి రికార్డు వరకు పరిశీలిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌కు ముందు రికార్డులు, ఆ తర్వాత రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి స్వతహాగా నిషేదిత జాబితాలోనుంచి తోఒఒలగిస్తున్నారు. ఇలా పలు భూములు కార్డులో నిషేదిత జాబితాలో, ధరణిలో పట్టా భూములుగా ఉన్నాయి. ఈ భిన్నమైన పద్దతిని సవరించేందుకు సర్కార్‌ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌, భూదాన్‌ గ్రామకంఠం, ప్రభుత్వ ఆఫీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన భూములు, అటవీ, జంగ్లత్‌, బంజరు, సీలింగ్‌, అసైన్డ్‌ భూములను ఇందులో చేర్చారు.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న మా పట్టాభూములను నిషేదిత జాబితానుంచి తొలగించండి. ధరణి పోర్టల్‌లో మార్పులు చేయండి అని ప్రభుత్వానికి లక్షలాదిగా ధరఖాస్తులు చేరాయి. దీంతో ప్రభుత్వమే సుమోటాగా సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగింది. ఆ భూముల వివరాలను పరిశీఇలంచి సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ ప్రక్రియ గురించి రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. రైతుల ప్రమేయం లేకుండానే కలెక్టర్‌లు పంపిన భూముల వివరాలను ఆ వివరాల్లో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి తహశీల్దార్లు ఇచ్చే నివేదికలు, వాటి ఆధారంగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, ఆ భూములను నిషేదిత జాబితానుంచి తొలగించారా…లేదా అనే అంశాలపై బైటికి సమాచారం ఇవ్వడంలేదు.

ధరణిలో ఇంకా పరిష్కారం కోరుతూ రైతులు నేరుగా చేసిన ఫిర్యాదులపై కదలిక వస్తున్నది. ఈ ఫిర్యాదులను జిల్లాల వారీగా వేరు చేసి కలెక్టర్లకు పంపి వివరాలను తీసుకున్నారు. వీటిని వీలైతే సుమోటాగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఈ పోర్టల్‌ రాకతో ఏళ్లనాటి భూ సమస్యలు తీరుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 60లక్షల మందికి చెందిన భూముల రికార్డులు క్లీయర్‌గా ఉండటంతో రైతుబంధు, రైతుబీమా వంటివి నేరుగా అందుతున్నాయి. ధరణిలోని గ్రీవెన్స్‌ మ్యాడ్యూల్‌ ద్వారా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అధికారులకు విచక్షణాధికారాల కోతతో అక్రమాలు తగ్గాయి. అయినా పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంవంటివి అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్‌, ఐటీ విభాగాలకు చెందిన అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ రెండు వెసులుబాట్లు వినియోగించుకునేలా సర్కార్‌ వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సత్వరమే ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -

పార్ట్‌ బి లో లక్షల ఎకరాలు…

కొత్తగా సర్వే నెంబర్ల ప్రకటన, ఎలాంటి సర్వే నెంబర్లు లేని భూముల వివరాలు, అసలు రికార్డుల్లోనే లేని గ్రామాలు, ఖాతా నెంబర్లు లేకుండా ఉన్న భూములు, పట్టా ఒకరిదైతే పొజిషన్‌లో మరోకరు, అమ్మినా యాజమాన్య హక్కు మారని వివరాల వంటివి దాదాపు 54 అంశాలతో కూడిన అక్రమాల్లో మొత్తం 2కోట్ల 40లక్షల 71 వేల 495 ఎకరాల భూ విస్తీర్ణంలో 74లక్షల 42వేల 910 ఎకరాల భూ విస్తీర్ణం వివాదాస్పదమేనని గుర్తించి పార్ట్‌-బిలో చేర్చారు. మొత్తంగా కోటి 76లక్షల81వేల 621 ఎకరాల భూమిని వివాదరహితంగా తేల్చారు. మొత్తం క్లీయర్‌ చేసిన భూముల వివరాల శాతం భూ రికార్డుల ప్రక్షాళన పూర్తినాటికి 85.61శాతానికే పరిమితమైంది.

70లక్షల కమతాలకు చెందిన 57.33 లక్షల కమతాలు వివాదరహితంగా తేల్చారు. అయితే వీటిలో 49.94 లక్షల పాస్‌ పుస్తకాలను ముద్రించారు. ఇందులోనే 42 లక్షల పాస్‌ పుస్తకాలే పంపిణీ చేశారు. మరో 7లక్షల పాస్‌ పుస్తకాల్లో ముద్రణా దోషాలు, పేర్లు, కమతాలు, ఖాతాలు, లింగ బేధాలు, విస్తీర్ణం వంటి తప్పులు దొర్లాయని గుర్తించి పంపిణీ చేయకుండా ఆపేశారు. మరో 1.76లక్షల పాస్‌ పుస్తకాలు పట్టాదార్లు రాకపోవడంతో నిలిపేశారు. మరో 6 లక్షల తప్పులు దొర్లిన పాస్‌ పుస్తకాలను తిరిగి ముద్రించి జిల్లాలకు చేరవేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement