Friday, March 29, 2024

‘దృశ్యం-2’ సరికొత్త రికార్డు

సరైన కంటెంట్ ఉంటే చాలు.. ఆ సినిమాను ప్రేక్ష‌కులు ఆదరిస్తారు అని మరోసారి చాటిచెప్పిన మూవీ ‘దృశ్యం-2’. ఈ చిత్రం ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. మోహ‌న్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ సినిమా విడుద‌లైంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19న కరోనా ప్ర‌భావంతో డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

తాజాగా ఈ సినిమా మ‌రో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన అన్నీ చిత్రాల్లో ‘దృశ్యం-2’ చిత్రానికే ఐఎండీబీ రేటింగ్ ఎక్కువ‌గా వ‌చ్చింది. 8.8 యూజ‌ర్ రేటింగ్‌తో ‘దృశ్యం-2’ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకుంది. మ‌రి ఈ రికార్డును ఏ సినిమా క్రాస్ చేస్తుందో చూడాలి. ‘దృశ్యం-2’ సినిమాను ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంక‌టేష్ హీరోగా జీతూ జోసెఫ్ తెర‌కెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement