Friday, April 19, 2024

గుజ‌రాత్ లో సానుభూతి కోసం మోదీ అస‌త్యాలు : కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

గుజ‌రాత్ లో రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ త‌రుణంలో నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేద‌వాడిన‌ని చెబుతార‌ని, అయితే తాను అంట‌రానివారిలో ఒక‌డిన‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అన్నారు. మోదీ అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాల‌న్నారు. న‌ర్మ‌దా జిల్లాలోని దెదిప‌ద‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఖ‌ర్గే ప్ర‌సంగించారు. మోదీ పాల‌న‌లో సామాన్య ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నార‌న్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గుజారాత్ లో ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement