Thursday, April 25, 2024

రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలు అనుచితం – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు , ప్రభ న్యూస్ : పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విభజనపై రాజ్యసభ సమావేశంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా ర్యాలీ, బస్టాండ్ సెంటర్ లో ధర్నాను చేప‌ట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రాజ్య సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని, తెలంగాణ ఇచ్చినప్పుడు బిజెపిలో ఒక సుష్మా స్వరాజ్ మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపార‌ని..మిగతా బిజెపి నాయకులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం పట్ల కక్ష సాధింపు విధంగా ఉన్నారని మంత్రి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ప్రధాని తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తొర్రూర్ మండల , పట్టణ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement