Thursday, March 28, 2024

25న ముంబైకి ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల 25న మహారాష్ట్రలో ముంబైలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా సమ్మిట్‌-2023 పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్‌ ఆధ్వర్యంలో 2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం అనే అంశంపై నిర్వహించే చర్చలో పాల్గొననున్నారు. చర్చా వేదికలో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ పాల్గొననున్నారు.

బీఆర్‌ఎస్‌ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను కవిత ఎండగట్టనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement