Thursday, April 25, 2024

Kothagudem | సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే వనమా.. భూ నిర్వాసితుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

కొత్తగూడెం నియోజకవర్గంలోని సింగరేణి భూ నిర్వాసితులు.. SRT, వనమానగర్, మాయాబజార్, కిరోసిన్ బంక్ రైల్వే భూ నిర్వాసితుల సమస్యలపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో ఎమ్మెల్యే వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) చ‌ర్చించారు. హైదరాబాదులో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ని కలిసి కొత్తగూడెం నియోజకవర్గంలోని భూ నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్యపై చర్చించారు. దీనిపై స్పందించిన సీఎస్ సోమేశ్ కుమార్ వెంటనే CCLA రజత్ కుమార్ సైనీకి భూ నిర్వాసితులకు స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తారని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వ‌న‌మా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement