Friday, April 19, 2024

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని మంత్రి నివాస ప్రాంగణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. తన గెలుపు కోసం అవిరామ కృషి చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement