Thursday, April 25, 2024

బ్రహ్మణేతరులను పూజారులుగా నియమించిన స్టాలిన్..

తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణేతరులకు కూడా అనుమతినిచ్చింది స్టాలిన్ ప్రభుత్వం. సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణేతరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాలకు చెందిన వారుగ కాగా, మరో ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు.

ఇది కూడా చదవండి: కోట్లు విలువైన 11 లగ్జరీ కార్లు సీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement