Friday, April 19, 2024

ప్ర‌తిరోజు నిన్ను ఎంత‌గానో మిస్ అవుతున్నా అమ్మా-జాన్వీక‌పూర్ ఎమోష‌న‌ల్ పోస్ట్

అందంలో త‌ల్లికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటోంది శ్రీదేవి పెద్ద కుమారై జాన్వీక‌పూర్.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. జాన్వీ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైంది. ప్రస్తుతం ఆమె మిల్లీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో నటిస్తున్నారు.కాగా నేడు ఆగ‌స్టు 13న దివంగ‌త న‌టి శ్రీదేవి జ‌యంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రియమైన అమ్మను గుర్తు చేసుకుంది. బాల్యంలో తాను అమ్మతో దిగిన ఫోటో షేర్ చేసిన జాన్వీ… ప్రతి రోజు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్ డే మమ్మీ… అంటూ కామెంట్ పెట్టారు. స్టార్ హీరోయిన్ గా భారత చలన చిత్ర పరిశ్రమను ఏలిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్ లో మరణించారు. అప్పటికి శ్రీదేవి వయసు కేవలం 54 ఏళ్ళు మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement