పదవ తరగతి పరీక్షల పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ . ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి లో మొక్కలు నాటారు సురేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ వస్తున్నామని… కానీ రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. 10వ తరగతి పరీక్షలను ప్రతిపక్షాలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం సరి కాదని అన్నారు.
నారా లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ ఉంది. పేద విద్యార్థులకు ఎటువంటి సహకారం ఇప్పుడు లేదు. పదవ తరగతి ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ప్రమాణం. కాబట్టి పరీక్షలు ఖచ్చితంగా పెట్టి తీరుతాం. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు సురేష్.