Wednesday, April 24, 2024

పది పరీక్షల రద్దు ప్రసక్తే లేదు…మంత్రి సురేష్

పదవ తరగతి పరీక్షల పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ . ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి లో మొక్కలు నాటారు సురేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ వస్తున్నామని… కానీ రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. 10వ తరగతి పరీక్షలను ప్రతిపక్షాలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం సరి కాదని అన్నారు.

నారా లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ ఉంది. పేద విద్యార్థులకు ఎటువంటి సహకారం ఇప్పుడు లేదు. పదవ తరగతి ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ప్రమాణం. కాబట్టి పరీక్షలు ఖచ్చితంగా పెట్టి తీరుతాం. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు సురేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement