Thursday, March 28, 2024

దేశమ్మ తల్లికి టిటిడి త‌ర‌పున‌ పట్టు వస్త్రాలు సమర్పించిన -మంత్రి రోజా సెల్వమణి దంపతులు

తిరుపతి సిటీ.. ప్రభ న్యూస్ : దేశమ్మ తల్లికి టిటిడి పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక ..సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా మంత్రి రోజా సెల్వమణి దంపతులు నగిరి పట్టణంలోని గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లి అమ్మవారికి ఆడి నెల పూజా ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించారు.. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున మొట్టమొదటిసారిగా పట్టు వస్త్రాలను మంత్రి ఆర్కే రోజా సెలవమని దంపతులు ఆలయ సమీపంలోని శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుంచి కాలినడకన తీసుకుని వెళ్లి దేశం వారికి స్వయంగా సమర్పించారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుముతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు వేదమంత్రాలుతో దంపతులను ఆశీర్వదించారు. మంత్రి దంపతులకు దేశము అమ్మవారికి పొంగిళ్లతో నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement