Wednesday, March 27, 2024

సైకిల్‌ తొక్కిన తెలంగాణ మంత్రి

ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏకంగా సైకిల్‌పై పర్యటించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి కూడా సైకిళ్లు తొక్కారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెండింగ్‌ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మంలోని జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్‌నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్‌ఆర్‌ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వ ఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్‌డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డుకు ఇరు వైపులా జరుగుతున్న కాలువ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను మంత్రితో పాటు అధికారులు పరిశీలించారు. పనులు నెమ్మదిగా జరుగుతుండటం పట్ల అధికారులను మంత్రి అజయ్ నిలదీశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement