Wednesday, April 24, 2024

రామయ్యకు మెరుగైన చికిత్సలు అందించాలని మంత్రి పువ్వాడ ఆదేశం

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం పంచాయితీలోని, మారమ్మగుడి వద్ద మొక్కలకు నీరు పోసెందుకు రోడ్డుపైకి వచ్చిన పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర‌ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యులను మంత్రి ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి పువ్వాడ ..రామయ్యకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని అదేశించారు. అనంతరం రామయ్య ఆరోగ్య పరిస్థితి గూర్చి మంత్రి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా డాక్టర్లు వివరించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారం అందించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement