Saturday, April 20, 2024

ప్ర‌జ‌ల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్య‌త – మంత్రి కేటీఆర్

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా బాలాన‌గ‌ర్, కోయిల్ కొండ ప్రాంతాల్లో ఉండే హాస్ప‌ట‌ల్ పాత భ‌వ‌నాలు, కొత్త భ‌వ‌నాల ఫొటోల‌ను ట్విట్ట‌ర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .. బాలా న‌గ‌ర్, కోయిల్ కొండ ప్రాంతాల‌లో శిథిలావ‌స్థ‌లో ఉన్న ఆస్ప‌త్రులు ఆధునిక హంగుల‌తో తీర్చి దిద్దారన్నారు. దీంతో ఆ ఫోటోల‌ను త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా పంచుకుని త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని కామెంట్ రాశారు. అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ కృషి కి ప‌ని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. జ‌డ్చ‌ర్ల‌, నారాయణ‌పేట్ ఎమ్మెల్యే ల‌కు అభినంద‌న‌లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement