Saturday, April 20, 2024

మ‌హేశ్ బాబు మాతృమూర్తి పార్ధవదేహనికి నివాళి అర్పించిన మంత్రి కేటీఆర్‌

సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందిరాదేవి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఈ తెల్లవారుజామున ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement