Wednesday, April 24, 2024

టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో జరిగిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని, కానీ టీడీపీ దాన్ని వైసీపీ నేతలు చేసిన ఘటనగా ప్రొజెక్ట్ చేస్తోందని ఆరోపించారు. దళితులు, పోలీసులను దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని.. ఉద్దేశపూర్వంగానే వారిని రెచ్చగొట్టారని.. అందుకే గ్రామస్తులు తిరగబడాల్సి వచ్చిందని కొడాలి నాని వివరించారు.

టీడీపీ నేతలు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నారని.. తమ కార్యకర్తలపై దాడి చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని విమర్శలు చేశారు. ఆరు నెలల్లో టీడీపీని చంద్రబాబు బీజేపీలో విలీనం చేయడం ఖాయమని కొడాలి నాని భాష్యం చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: గోవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement