Tuesday, April 23, 2024

వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

వేములవాడ రాజన్న క్షేత్రం శివ శివనామస్మరణతో మారుమోగుతోంది. రాజన్న దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయ‌న తోపాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement