Friday, April 19, 2024

గంగుల మల్లయ్యకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి స్వర్గీయ మల్లయ్య దివ్య స్మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన నివాళులర్పించారు. కరీంనగర్ లోని వారి నివాసంలో ఐదో రోజు కార్యం సందర్భంగా గంగుల, వద్దిరాజు వంశస్తులు మల్లయ్య గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఆయన చిత్రపటానికి మంత్రి కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి జోగు రామన్న, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, దండే విఠల్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ నివాళుల‌ర్పించారు.

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, సీపీఐ ప్రముఖ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. అలాగే, బీఆర్ఎస్ కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు, సర్థార్ పుట్టం పురుషోత్తం, ఆకుల రజిత్, ఊసా రఘు, ఆకుల గాంధీ, శెట్టి రంగారావు, దుర్గం రవీందర్, విష్ణు జగతి, వెల్మినేటి రమేష్ నాయుడు, జెన్నాయికోడే జగన్మోహన్, కోట్ల వినోద్, బీఆర్ఎస్ నాయకులు రిజ్వాన షమీమ్ మసూద్, సికిందర్ రెడ్డి, కూసం శ్రీనివాస్, జెన్నాయికోడే చంద్రశేఖర్, రాజనాల శ్రీహరి, యాకుబ్ పాషా, బొలుగొడ్డు శ్రీనివాస్, గంధం సత్యనారాయణ తదితరులు మల్లయ్య గారికి ఘన నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement