Wednesday, April 24, 2024

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి హ‌రీష్ రావు

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. గురువారం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్‌ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement