Tuesday, April 23, 2024

మట్టి గణపతినే పూజించాలంటూ మంత్రి హరీష్‌రావు పిలుపు

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాల‌న్న‌ తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామ‌న్నారు. అన్ని విఘ్నాలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి ఆయన ప్రార్ధించారు. కరోనా మహమ్మారి అనే విఘ్నం తొలగాలని కోరుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాల‌ని ఆకాంక్షించారు.

ప్ర‌తి కుటుంబం మట్టి గణపతి ప్రతిమల‌ను ప్రతిష్ఠించుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించుకోవాల‌ని హరీష్‌రావు సూచించారు. ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని, మట్టి గణపతినే పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దాం. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు, నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించుకుందామని పిలుపునిచ్చారు. మన అందరిపై విఘ్నేశ్వ‌రుని అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి హ‌రీష్‌రావు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement