Thursday, April 18, 2024

మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది.
భార్యాపిల్లలతో బైకుపై వెళ్తూ వ్యక్తి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న భార్యాపిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న మంత్రి హరీష్‌రావు ఈ ఘటనను చూసి ఆయన ఆగిపోయారు.

ఈ ప్రమాదాన్ని పరిశీలించిన మంత్రి హరీష్‌రావు.. గాయపడ్డ భార్యాపిల్లలకు తక్షణమే చికిత్స అందించే నిమిత్తం అంబులెన్సును పిలిపించారు. అంబులెన్సులో ఆ కుటుంబాన్ని సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించారు. కాగా మంత్రి హరీష్‌రావు తక్షణమే స్పందించి బాధితులకు చేసిన సాయంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement