Wednesday, April 24, 2024

బీజేపీ నేతల ఆరోపణలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్

బీజేపీ నేతల ఆరోపణలకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. తాంత్రిక పూజలు చేసినట్టు సాక్ష్యాలు చూపించాలన్నారు. కేంద్ర మంత్రి నిర్మల దిగజారి మాట్లాడుతున్నారన్నారు. తమ దగ్గర ఉన్న తాంత్రిక విద్యలు లేవన్నారు. లోక్ తాంత్రిక్ విద్యలున్నాయన్నారు. మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందన్నారు. 200కార్లు, మోటార్ సైకిళ్లు బుక్ చేశారన్నారు. ఇవాళ మోటార్ సైకిళ్లు, రేపు మీటర్లకు మోటార్లు అని అన్నారు. మోటార్లు కావాలో.. మీటర్లు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement