Thursday, April 25, 2024

కంట్రోల్ లోనే కరోనా.. ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ

తెలంగాణలో కోవిడ్ నియంత్రణలోనే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువ ఉందన్నారు. కరోనా నియంత్రణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలు ప్రశంసనీయ స్థానంలో ఉందన్నారు. జ్వర సర్వే పూర్తి అయిందని, కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. మూడో విడత కరోనా విజృంభణ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం చాలా తక్కువగా ఉందని వైద్యశాలల అవసరం లేకుండానే ఇంట్లో ఇసోలేషన్ లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని మంత్రి తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉందని చెప్పారు.
జనగామ జిల్లాలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రభుత్వ దవాఖానాలలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. కరోనాకు భయపడాల్సిన పని లేదన్నారు. జనగామ జిల్లాలో మూడో విడత కరోనా కారణంగా 1,166 యాక్టివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని మంత్రి చెప్పారు. కేసుల నమోదు శాతం 11.46% ఉ0దన్నారు.

జనగామ జిల్లాలో 100 ఐసోలేషన్ బెడ్లు, 154 ఆక్సీజన్ బెడ్లు, 15 ఐసియు బెడ్ లు, మరో పది ఐసియుతో పాటు వెంటిలేటర్ గల బెడ్ల ను ప్రజల కోసం సిద్ధంగా ఉంచామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే మాతా శిశు హాస్పిటల్ మొత్తం 258 బెడ్ లలో 256 బెడ్స్ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి అని మంత్రి తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారు నాలుగు లక్షల 15,569 మంది ఉన్నారని అన్నారు. జిల్లాలో రెండో డోస్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 3 లక్షల 55 వేల 488 ఉన్నట్లు వివరించారు. ఇంకా రెండో తీసుకోవాల్సిన వారి సంఖ్య 60 వేల 81 ఉన్నారని తెలిపారు. బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్య 4,857. అని మంత్రి వివరించారు.

జిల్లాలో ఇప్పటివరకు 77,255 కరోనా కిట్లను పంపిణీ చేశామని మరో 13 వేల 777 కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. అలాగే కోటి 5 లక్షల రూపాయలను 200 మందికి ఎక్స్గ్రేషియాగా చెల్లించామని మంత్రి తెలిపారు. జ్వర సర్వేలో జనగామ జిల్లా ప్రశంసనీయ స్థానంలో ఉందని మంత్రి అన్నారు. జనగామ జిల్లాలో 453 జ్వర సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, వీరిలో 393 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 60 బృందాలు పట్టణ ప్రాంతంలో పని చేశాయన్నారు. ఈ బృందాలు జ్వర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారిని 5,916 మంది గా గుర్తించారని వాళ్లకి వెంటనే అక్కడికక్కడే కరోనా కిట్లను పంపిణీ చేశారని తెలిపారు. సర్వే పర్యవేక్షించడానికి 281 మంది అధికారులను గ్రామాల వారీగా నియమించినట్లు మంత్రి వివరించారు.

ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వాన లకు జరిగిన పంట నష్ట అంచనాలను మంత్రి వివరించారు. జనగామలో 77 ఎకరాలలో, స్టేషన్గన్పూర్ లో 40 ఎకరాల లో, పంట నష్టాలు జరిగాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తిలో 197 ఎకరాలలో, దేవరుప్పుల లో 50 ఎకరాలలో, కొడకండ్ల లో 412 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. మొత్తం ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి 776 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అంచనా వేశామని చెప్పారు. త్వరలోనే సీఎం గారికి నివేదికలు పంపించి పంట నష్ట పరిహారం అందే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement