Tuesday, March 26, 2024

జూనియర్ ఎన్టీఆర్ కాదు… ఎవడొచ్చినా భయం లేదు – బాలినేని

చంద్రబాబు, నారా లోకేష్ ఉన్నంత వరకూ టిడిపి పార్టీకి పుట్టగతులు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్. చంద్రబాబు, లోకేష్ ను జనం చీదరించుకుంటున్నారని అన్నారు. మాట మాట్లాడితే చంద్రబాబు అబద్ధమే మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి బాలినేని. ఇక నారా లోకేష్ ఒక పప్పు. అలాంటి పప్పు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పోటి పెట్టుపెట్టుకుంటున్నాడని విమర్శించారు. లోకేష్ దేనికి పనికి రాడని అమెరికాకు పోయి ఎంజాయ్ చేసుకోవాలని అన్నారు.

జూనియర్ ఎన్టీఆరే కాదు ఎవడొచ్చినా మాకు భయం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం టిడిపి పార్టీ కాస్త నిలబడుతుందని అన్నారు. ఇప్పటికైతే టిడిపి పార్టీ క్లోజ్ అయిందని ఆఫీస్ కు తలుపులు వేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక మూడు రాజధానులు గురించి చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే మంచిదని హెచ్చరించారు బాలినేని శ్రీనివాస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement