Thursday, April 25, 2024

సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ విప్ల‌వాత్మ‌క ప‌రిణామం.. మిలియ‌నియం పోస్ట్

హైద‌రాబాద్ – ఎంపి జె సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా కొన‌సాగుతుంది.. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు, రాజ‌కీయ నేత‌ల నుంచి సెల‌బ్రిటిల‌ వ‌ర‌కు మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని నిర్విఘ్నంగా అమ‌లు చేస్తున్నారు.. భారాస ఎంపి సంతోష్ కుమార్ నాంది ప‌లికి, అమ‌లు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని కోల్ క‌తా కేంద్రంగా ప్ర‌చురితం అవ‌తున్న మిలియ‌నియం పోస్ట్ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌శంసిస్తూ సుదీర్ఘ‌మైన ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించారు.. గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మంతో అనేక ప్రాంతాలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని, అడ‌వుల‌లో గ్రీన‌రీ పెరిగిందంటూ ఆ క‌థ‌నంలో పేర్కొంది. సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంచ్ భార‌త దేశంలో స‌రికొత్త విప్ల‌వాత్మ‌క ప‌రిణామం అంటూ విశ్లేషించింది.. వాయి కాలుష్యంతో పాటు, కార్బ‌న్ ఉద్ఘారాల‌ను త‌గ్గించేందుకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌ని మిలియ‌నియం పోస్ట్ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement