Wednesday, April 24, 2024

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్యనాదెళ్లకు అదనపు బాధ్యతలు

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఇప్పటికే కంపెనీ సీఈవోగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. బోర్డు ఛైర్మన్​ పదవికి స్వతంత్ర డైరెక్టర్లు.. బుధవారం నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్​ కార్పొరేషన్​ ప్రకటించింది. జాన్​ డబ్ల్యూ థామ్సన్​ను స్వతంత్ర డైరెక్టర్​గా నియమించారు. 2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్​ సీఈవోగా పనిచేస్తున్నారు. కాగా భారత సంతతికి చెందిన తెలుగు వ్యక్తి అయిన నాదెళ్ల మరో మెట్టు ఎక్కడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement