Thursday, April 25, 2024

క్రీడలతో మానసికోల్లాసం.. గెలుపు ఓట‌ముల‌ను స్పోర్టీవ్‌గా తీసుకోవాలి : ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు

నారాయణపేట, (ప్రభ న్యూస్): క్రీడలు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, ఆటల్లో గెలుపోటములను సహజంగా తీసుకుని ఓడినవారు మరింత పట్టుదలతో గెలవడానికి ప్రయత్నించాలని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోనీ లైన్స్ క్లబ్ లోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయ‌న ఇవ్వాల (ఆదివారం) ప్రారంభించారు. టోర్నమెంట్లో మొత్తం జిల్లా స్థాయిలో వివిధ మండలాల నుంచి 28 టీమ్ లు పాల్గొన్నాయి. క్రీడల వల్ల వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలు తట్టి లేపడంతో పాటు టీం స్పిరిట్, ఐక్యమత్యాన్ని పెంచుతాయ‌న్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింట‌న్‌ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement