Friday, March 29, 2024

భోళా శంక‌ర్ లో- ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అభిమానిగా చిరంజీవి !

భోళా శంక‌ర్ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అభిమానిగా క‌నిపించ‌నున్నార‌ట మెగాస్టార్ చిరంజీవి. వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళా శంక‌ర్ రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేశ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి .. చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, చిరుకు జోడీగా తమన్నా భాటియా కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన రూమల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి..ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అభిమానిగా కనిపించనున్నారట‌. ‘ఖుషీ’ సినిమాలోని ‘‘నడుము’’ సీన్‌ను ఇందులో పెట్టినట్లు వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌గా చిరంజీవి, భూమికగా శ్రీముఖి ఈ చిత్రంలో కనిపిస్తారని వినికిడి. అయితే ఇందులో నిజమెంత అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ డైరక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement