Saturday, April 20, 2024

జీ20 స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌పై మీటింగ్.. ఢిల్లీ వెళ్ల‌నున్న చంద్ర‌బాబు..జ‌గ‌న్

జీ20 స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు భార‌త్ చేతికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది.ఈ స‌మావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మరోపక్క, చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement