Thursday, April 25, 2024

నారా లోకేశ్ తో భేటీ అయిన – ఆనం కుమారై కైవ‌ల్యారెడ్డి

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నెల్లూరు వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమారై..టిడిపి జాతీయ‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తో భేటీ కావ‌డం విశేషం. టీడీపీ మ‌హానాడు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తన భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వచ్చిన కైవ‌ల్యా రెడ్డి ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె లోకేశ్‌ను కోరిన‌ట్లు స‌మాచారం. దీనిపై లోకేశ్ ఎలా స్పందించార‌న్నది తెలియ‌రాలేదు. తాజాగా ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ‌లోనూ ఆనంకి జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం… త‌న కూతురు నారా లోకేశ్ తో భేటీ జ‌ర‌గ‌డంపై ప్ర‌చారం సాగుతోంది. దివంగ‌త మంత్రి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌లైంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో కైవ‌ల్యా రెడ్డి నేరుగా నారా లోకేశ్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement