Wednesday, April 24, 2024

మీరా జాస్మిన్ రీ ఎంట్రీ.. డ‌బ్బింగ్ చెబుతోన్న న‌టి

న‌టి మీరాజాస్మిన్ రీ ఎంట్రీకి వేళయ్యింది. ఈమె టాలీవుడ్ లో ప‌లువురు స్టార్ హీరోల‌కి జోడీగా న‌టించింది..వివాహం త‌ర్వాత ఇన్నేళ్ల‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. కాగా త్వరలోనే ఆమె నటించిన తెలుగు సినిమా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు మీరా జాస్మిన్. తన రోల్‌ డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్పలేదు. ఆమె ఏ మూవీలో నటిస్తున్నారు.. హీరో ఎవరు.. దర్శకుడు ఎవరు.. లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.మీరా జాస్మిన్.. చివరిగా నటించిన తెలుగు మూవీ ‘మోక్ష’. 2013లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement