Thursday, March 28, 2024

ఈపీఎఫ్‌ గరిష్ట వేతన పరిమితి 21 వేలు.. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం

ఉద్యోగుల భవిస్య నిధి (ఈపీఎఫ్‌ఓ) కు సంబంధించి ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 15 వేలుగా ఉన్న పరిమితిని 21 వేలకు పెంచనుందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంపై దీనిపై నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు, యజమానుల చెల్లించే వాటా పెరుగుతుంది. దీని వల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పుడు 6,500గా గరిష్ట వేతనాన్ని 15 వేల రూపాయలకు పెంచారు. 20 మంది కంటే ఎక్కువ ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజాగా ఈ పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించనుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు గరిష్ట వేతన పరిమితిని ఈ కమిటీ సమీక్షిస్తుంది.

సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని 12 శాతం వాటాను చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. ప్రస్తుతం ఉన్న గరిష్ట వేతన పరిమితి ప్రకారం 8.33 శాతం కింద 1250 రూపాయలు ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా మొత్తం ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. గరిష్ట పరిమితి పెరిగితే ఉద్యోగి, యజమాని వాటా పెరుగడంతో పాటు, పెన్షన్‌ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది.

ఇలా లెక్కిస్తారు…

- Advertisement -

ఒక ఉద్యోగి వేతనం (బేసిక్‌ ప్లస్‌ డీఏ ) 30 వేలు ఉంటే, ఇందులో ఉద్యోగి వాటాగా 3,600 ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటాగా 3,600 ఉంటాయి. గరిష్ట వేత పరిమితి 15వేలను పరిగణనలోకి తీసుకుంటే, 8.33 శాతం కింద 1250 రూపాయలు ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా 2350 రూపాయలు ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్‌ ఖాతాలో 5950 ఉంటాయి. గరిష్ట పరిమితి 21 వేలు చేస్తే, ఈపీఎఫ్‌లో 1750 జమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement