Saturday, April 20, 2024

కోబ్రా కమాండ్ రాకేశ్ సింగ్ మా ఆధీనంలోనే ఉన్నాడు :కేంద్రానికి మావోల లేఖ

చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు మెరుపుదాడి చేసి భద్రతా బలగాలను దారుణంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఎన్ కౌంటర్ అనంతరం రాకేశ్ సింగ్ అనే కోబ్రా కమాండో కనిపించకుండా పోయాడు. అతడి కోసం సీఆర్పీఎఫ్ బలగాలు తీవ్రస్థాయిలో గాలిస్తున్నాయి. అయితే, అతడు తమ అధీనంలోనే ఉన్నాడని తాజాగా మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కేంద్రానికి లేఖ రాశారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement