Wednesday, April 24, 2024

వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రెండు మ్యాచ్‌లపై విచారణ

వింబుల్డ‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. క‌నీసం రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌రుగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్‌, మ‌రో డ‌బుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మేరకు బెట్టింగ్ న‌మూనాల‌ను గుర్తించిన అధికారులు.. ఆ రెండు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. కొన్ని బెట్టింగ్ సంస్థ‌లు కూడా ఈ మ్యాచ్‌ల‌పై జ‌రిగిన బెట్టింగ్‌ల‌పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి. పురుషుల డ‌బుల్స్ ఫ‌స్ట్ రౌండ్ మ్యాచ్ ఈ జాబితాలో ఉంది. లైవ్ బెట్టింగులు చాలా ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఈ మ్యాచ్‌లో ఫేవ‌రెట్ జోడీ ఓడిపోయిన‌ట్లు ప‌లు బెట్టింగ్ సంస్థ‌లు ఫిర్యాదు చేశాయి.

ఈ జోడీ తొలి సెట్ గెలిచి త‌ర్వాతి రెండు సెట్ల‌ను ఓడిపోయింది. ఇక మ‌రొక‌టి జ‌ర్మ‌నీ ఆటగాడు ఆడిన ఫ‌స్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌. అయితే ఆ ప్లేయ‌ర్ ప్ర‌త్య‌ర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ త‌ర్వాత ప‌రిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ న‌డిచిన‌ట్లు తేలింది. క‌చ్చితంగా ఫ‌లితం కూడా అలాగే వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో స‌ర్వీస్ గేమ్స్ సంఖ్య‌పై కూడా ప్ర‌త్యేక బెట్స్ న‌డిచాయి. ఈ రెండు మ్యాచ్‌ల‌పై ఇంట‌ర్నేష‌న్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచార‌ణ జ‌రుపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్ మ‌ధ్య మొత్తం 11 మ్యాచ్‌ల‌పై ఫిక్సింగ్ ఫిర్యాదుల‌ను ఐటీఐఏ అందుకుంది.

ఈ వార్త కూడా చదవండి: జకోవిచ్ ఖాతాలో 20వ గ్రాండ్ స్లామ్

Advertisement

తాజా వార్తలు

Advertisement