Thursday, March 28, 2024

Master Killer | అప్సరను సాయికృష్ణ ఎలా చంపాడంటే?

హైద‌రాబాద్: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురోహితుడు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన శంషాబాద్‌ పరిధిలో చోటుచేసుకుంది. అనంత‌రం ప్రియురాలు అప్స‌ర‌ మృతదేహాన్ని స‌రూర్ న‌గ‌ర్ లోని త‌న ఇంటి స‌మీపంలోని మ్యాన్‌ హోల్‌లో పడేసి చేతులు దులుపుకున్నాడు ప్రియుడు సాయికృష్ణ‌. త‌ర్వాత ఏమీ ఎరుగనట్లు ప్రియురాలి మిస్సింగ్‌ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే.. సాయికృష్ణ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌తోపాటు.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు.

వివ‌రాల‌లోకి వెళితే సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్ప‌టికే ఒక‌సారి ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో సాయికృష్ణ అబార్ష‌న్ చేయించాడు.. తాజాగా అప్స‌ర మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని గ‌త రెండు నెలలుగా సాయి పై తీవ్ర వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ది. దీంతో ఆమె భారీ నుంచి తప్పించుకునేందుకు హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుని ప‌క్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు .. ముందుగా కేసులో నిందితుడైన సాయికృష్ణ అప్సరను ఈ నెల మూడో తేదిన‌ ఇంట్లో కోయంబత్తూర్ వెళుతున్నామ‌ని చెప్పి అప్సర బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు…

ఫోర్డ్ కారులో సరూర్‌నగర్ నుంచి బయలుదేరిన అప్సర సాయి.. శంషాబాద్ చేరుకున్న తర్వాత రాళ్ళగూడ వైపు కారును తీసుకెళ్లాడు. రాళ్లగూడలో సాయి, అప్సరలు కలిసి భోజనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భోజనం చేసిన తర్వాత ఫోర్డ్ కారులో అప్సర ఫ్రంట్ సీటులో రిలాక్స్‌డ్ మోడ్‌లో కూర్చుంది. ఇదిలా ఉండగా అప్సరను హత్య చేసేందుకే ఇంటి దగ్గర నుంచి బెల్లం దంచే దొడ్డు కర్రని సాయి తీసుకొచ్చాడు. అప్సర రిలాక్స్‌గా కూర్చొని నిద్రిస్తున్న సమయంలో తలపై దాడి చేసి హత్య చేశాడు. అప్సరను అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటిముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత మట్టిని అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు డ్రామా ఆడాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపాడు.

- Advertisement -

ఇదిలా ఉండగా కూతురు కనిపించట్లేదంటూ అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న నేపథ్యంలో హత్య చేశానని సాయి ఒప్పుకున్నాడు. దీంతో పాటు గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలిసింది.వివాహం చేసుకోవాలని అప్సర చిత్ర హింసలకు గురి చేసిందని సాయి చెప్పాడు. వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే హత్య చేశానని సాయి తెలపడంతో అసలు నిజం బయటపడింది. కాగా, మ్యాన్ హోల్ లో ఉన్న అప్ప‌ర శ‌వాన్ని పోలీసులు బ‌య‌ట‌కు తీశారు.. వారం రోజులు కావ‌డంతో శ‌వం పూర్తిగా చెడిపోయింది.. పోస్ట్ మార్ట‌మ్ కోసం ప్ర‌భుత్వ హ‌స్ప‌ట‌ల్ కు మృత‌దేహ‌న్ని త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement