Tuesday, April 23, 2024

భారీగా తగ్గిన కేసులు : కొత్తగా 1829మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గతంలో కంటే రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24గంటల్లో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా, 15,647 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 33 మంది కరోనాకు బలవగా, 2549 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement