Friday, April 19, 2024

ఫ‌ర్నిచ‌ర్ గోదాంలో అగ్నిప్ర‌మాదం.. మంట‌లార్పుతోన్న ఫైర్ సిబ్బంది

ఫ‌ర్నిచ‌ర్ గోదాంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ సంఘ‌ట‌న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్‌ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని ఎనిమిది ఫైరింజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే, గోదాంలో కేవలం ఫర్నీచర్‌ మాత్రమే ఉన్నదా.. సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement