Wednesday, April 17, 2024

ఒలింపిక్స్‌ను విజయంతో మొదలుపెట్టిన మేరీకోమ్

ప్రపంచ ఛాంపియన్ మెక్ మేరీ కోమ్ 51 కిలోల విభాగం మహిళల బాక్సింగ్ లో అదరగొట్టింది. విజయంతో టోక్యో ఒలింపిక్స్‌ను ప్రారంభించింది. ఇవాళ డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4–1 తేడాతో మట్టి కరిపించింది. ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

ప్రి క్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను మేరీకోమ్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మేరీ కోమ్ కు ఆ రౌండ్ సవాల్ తో కూడుకున్నదే. మరోవైపు టేబుల్ టెన్నిస్ విభాగంలో మనికా బాత్రా ముందంజ వేసింది. మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గరీటా పెసోస్కాను 4–3 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నా పుంజుకుని ఆమె విజయం సాధించింది.

ఈ వార్త కూడా చదవండి: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement