Thursday, April 25, 2024

మార్కెట్‌లో మారుతి న్యూ ఎర్టిగ.. 8.35 లక్షల నుంచి షురూ

దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం కొత్త తరం మల్టిd పర్పస్‌ వెహికల్‌ ఎర్టిగను ఆవిష్కరించారు. ఎక్స్‌షోరూమ్‌లో దాని ధర రూ.8.35 లక్షల నుంచి రూ.12.79 లక్షల మధ్య పలుకుతుంది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ మోడ్‌లో 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో దీన్ని ఆవిష్కరించారు. సీఎన్జిd ట్రిమ్స్‌ ఎర్టిగాను ఆవిష్కరించారు. ప్యాడిల్‌ షిప్టర్లతో అత్యాధునిక 6స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్ హైబ్రీడ్‌ టెక్నాలజీతో నూతన తరం ఎర్టిగను రూపుదిద్దారు. భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎర్టిగ గణనీయ పాత్ర పోషించింది. ఇది కొత్త సెగ్మెంట్‌ను క్రియేట్‌ చేసింది అని మారుతి సుజుకి ఇండియా ఎండీ కం సీఈవో హిషాషి తాకైచి చెప్పారు. తదుపరి తరం ఎర్టిగలో నూతన ఇంజిన్‌, ఆల్‌న్యూ ట్రాన్స్‌మిషన్‌, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వినియోగదారులకు ఇంధన ఆదాతోపాటు టెక్నాలజీ, సేప్టీ ఫీచర్లతోపాటు సౌకర్యవంతమైన బ్రాండ్‌ విజన్‌ మారుతిసుజుకి కలిగి ఉంది. తదుపరి తరం ఎర్టిగను భవిష్యత్‌లో భారత్‌ ఎంపీవీ (మల్టి పర్పస్ వెహికల్‌)గా ఎర్టిగ నిలుస్తుందని హిషాషి తాకైచి తెలిపారు. పెట్రోల్‌, సీఎన్జి ఆప్షన్లలో ఎర్టిగ మోడల్‌ కారు లభ్యం కానున్నది. పెట్రోల్‌ వేరియంట్‌ కారుపై ఒక లీటర్‌ 20.51 కి.మీ, సీఎన్జి వేరియంట్‌ కారు ఒక కిలో సీఎన్జిపై 26.11 కి.మీ మైలేజీ ఇస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement