Thursday, April 25, 2024

విచిత్రం… పెళ్లిలో మటన్ వండలేదని వివాహం రద్దు

ఒడిశాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎన్నో పెళ్లిళ్లు వివిధ కారణాల ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ తొలిసారిగా మటన్ వండలేదని పెళ్లి ఆగిపోయిన ఘటన బాజ్‌పూర్ జిల్లా మనతిరా గ్రామంలో జరిగింది. మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయితే విందులో మటన్ పెట్టకపోవడం వివాదానికి కారణమైంది.

తమకు మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులను అడిగారు. అయితే మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. తమ బంధువులకు పెళ్లికొడుకు కూడా వత్తాసు పలకడంతో వివాదం ముదిరింది. చివరకు పెళ్లికొడుకు తన వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, మరుసటి రోజు అతను మరొక యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ఇది కూడా చదవండి: సైకిల్‌పై కోడిగుడ్లు అమ్మిన సోనూసూద్

Advertisement

తాజా వార్తలు

Advertisement