Sunday, March 24, 2024

కోలుకున్న మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొలుకున్నాయి. గత వారం రెండు రోజుల ట్రేడింగ్‌లో ఏకంగా 10 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద అవిరైంది. సోమవారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. తరువాత క్రమంగా కోలుకున్న సూచీలు లాభాలబాట పట్టాయి. సోమవారం నాడు కూడా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. రిలయన్స్‌ షేర్‌ భారీగా పుంజుకోవడంతో మార్కెట్లు కోలుకున్నాయి. ఐటీ కంపెనీల షేర్లు కూడా రాణించాయి.

సెన్సెక్స్‌ 169.51 పాయింట్ల లాభంతో 59500.41 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.60 పాయింట్ల లాభంతో 17648.95 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 82 రూపాయలు తగ్గి 56775 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 225 రూపాయలు పెరిగి 68584 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.49 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రా టెక్‌ సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, మారుతీ సుజుకీ, ఎం అండ్‌ ఎం, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌ కంపెనీ, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, అదానీ పోర్టులు, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, దివీస్‌ ల్యాబ్‌, సిప్లా, హీరో మోటార్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement