Thursday, April 25, 2024

Follow up | నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కె ట్లలో ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్‌ సంక్షోభాలు, ఈ వారంలో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీ రేట్లు పెంచనుందన్న వార్తల నేపధ్యంలో మార్కెట్లు పూర్తిగా నష్టాల్లోనే కొనసాగాయి.

సెన్సెక్స్‌ 360.95 పాయింట్లు నష్టపోయి 57628.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 111.65 పాయింట్ల నష్టంతో 169988.40 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 153 రూపాయలు పెరిగి 59536 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 235 రూపాయలు పెరిగి 68736 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.68 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, టైటాన్‌ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫై నాన్స్‌, విప్రో, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌
మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఇండాల్కో, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, అపోలో ఆస్పటల్స్‌, సిప్లా షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement